మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర -ధర్మవరం: ప్రజల దాహార్తిని తీర్చడమే మున్సిపల్ కార్యాలయం యొక్క లక్ష్యము అని కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కళా జ్యోతి సర్కిల్ వద్ద చలివేంద్రాలను మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉందని, పట్టణానికి అనేక పనుల మీద గ్రామీణ ప్రాంతాల నుండి కూడా ఈ ముఖ్యమైన కూడలిలో రావడం జరుగుతుందని అటువంటి వారికి ఈ చరివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆసక్తి గల వ్యక్తులు అవసరమైన చోట మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి మానవతా విలువలు పెంపొందించాలని వారు తెలిపారు. ఈ చలివేంద్రాలు ఏర్పాటు పట్ల కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిల్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఈఈ సత్యనారాయణ, డి ఈఈ వీరేష్ కుమార్, వన్నూరప్ప,ఏ ఈ. హరీష్ తదితరులు పాల్గొన్నారు.