ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయడమే వైయస్సార్సీపి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వగృహంలో పదవ వార్డుకు చెందిన 30 కుటుంబాలు టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, పదవ వార్డ్ కౌన్సిలర్- పెనుజూరు నాగరాజు, పదో వార్డ్ ఇంచార్జ్ కృష్ణాపురం జమీర్, కృష్ణాపురం సహిన్స లా ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వము చేయని సంక్షేమ పథకాలను నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగిందని, ఇందులో భాగంగా నా నియోజకవర్గంలోని 4 మండలాలకు నవరత్నాల పథకాల పేరుతో అన్ని వర్గాల వారికి, కులాలకు అతీతంగా అర్హులైన వారందరికీ కూడా అందించడం జరిగిందని తెలిపారు. పార్టీ అభివృద్ధికి ప్రతి నాయకుడు, కార్యకర్తలు, పార్టీలో చేరిన వారందరూ కూడా కృషి చేయాలని, సైనికుల్లా పనిచేసినప్పుడే పార్టీ అభివృద్ధితోపాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకునే అవకాశం ఉందని తెలిపారు. వైయస్సార్ పార్టీ సంక్షేమ పథకాలు మాకు ఎంతగానో నచ్చడం వల్లనే పార్టీలో చేరడం జరిగిందని పదవ వార్డ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.