Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

డబ్బు అడిగితే సోదరుడిని హత్య చేసిన ఘటన

విశాలాంధ్ర ధర్మవరం;; వ్యాపార నిమిత్తం పట్టు చీర డబ్బులు అడిగినందుకు సోదరుడిని హత్య చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గీతా నగర్ లో నివసిస్తున్న సావిత్రి మగ్గం నేర్చుకుంటూ పట్టుచీరలు విక్రయిస్తూ ఉండేది. సావిత్రికి పెద్ద మనికంట చిన్న మణికంఠ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సావిత్రి కొంతకాలం క్రితం ఓ పట్టుచీరను తన చెల్లెలు నారాయణమ్మ కుమారుడు రమేష్ కు పదివేల రూపాయలకు విక్రయించింది. రోజులు గడిచిన పట్టుచీర డబ్బులు రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి సావిత్రి తో పాటు కుమారులైన పెద్ద మనికంట చిన్న మణికంఠ ఎదురింట్లో ఉన్న రమేషును డబ్బులు అడగడం జరిగింది. ఈ క్రమంలో వీరి మధ్య మాట పెరిగి, రమేష్ తన ఇంటిలోని కత్తితో చిన్న మణికంఠను తీవ్రంగా పొడిచాడు. అడ్డువచ్చిన సావిత్రి పెద్ద మనికంటపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తదుపరి పారిపోతుండగా స్థానికులు గమనించి రమేష్ ను పట్టుకొని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు స్థానికులు చిన్న మణికంఠను(23) స్థానిక ప్రభుత్వాసుపత్రిలో తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సావిత్రి తో పాటు పెద్ద మణికంఠ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన చిన్న మణికంఠకు 6 నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య సుధారాణి గర్భిణీ. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె ఆసుపత్రికి వచ్చి రోదించింది. సావిత్రి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img