Monday, May 20, 2024
Monday, May 20, 2024

అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కంశల అశోక్ కుమార్ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం:: అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి కు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన, కంశల అశోక్ కుమార్ను సమితి వ్యవస్థాపకులు రాజు దేశ్ పాండే నియమించారు. అనంతరం అశోక్ కుమార్ మాట్లాడుతూ అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మాల వేసిన అయ్యప్పలపై దాడులు జరగడం, హరిహరసుతుడు అయినటువంటి అయ్యప్పను నీచంగా దూషించడం లాంటి సంఘటనలపై తాము పోరాడుతామని తెలిపారు. హిందూ సాంప్రదాయాలను తప్పక కాపాడుతామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్న వారందరికీ పేరుపేరునా వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img