రాజాం (విజయనగరం జిల్లా) -విజయనగరం జిల్లా రాజాం కి చెందిన వైద్య విద్యార్థులు కర్గీస్థాన్ లొ వైద్య విద్యని అభ్యసించడానికి వెళ్లి ఈమధ్య అక్కడ సంభవించిన ఆందోళనలో చిక్కుకొని సంగతి తెలిసినదే.అయితే ఇప్పుడు అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకొని పోలీసులను మోహరించి కాలేజీ యాజమాన్యం ప్రొఫెసర్ లతో చర్చలు జరిపి సమస్యని ఒక దారికి తేడానికే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మేమంతా క్షేమమేనని ఏమైనా సమస్యలు తలెత్తినట్టయితే మమ్మల్ని భారతదేశం పంపిస్తామని భరోసా ఇచ్చారని అందుచేత తల్లితండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని రాజాం నవ్య నగర్ కు చెందిన పప్పుల నవీన్ కుమార్ తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు…