ఏఐఎస్ఎఫ్..
విశాలాంధ్ర ధర్మ వరం: జిల్లా వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పేరుతో వేలాది రూపాయలను వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి అని ఏఐఎస్ఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి దేవికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
జిల్లా వ్యాప్తంగా ముందస్తు అడ్మిషన్స్ పేరుతో లక్షలాది రూపాయలను విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేస్తూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పాఠ్యపుస్తకాల పేరుతో నర్సరీ నుండి పదవ తరగతి వరకు వేలాది రూపాయలను అక్రమంగా దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పై చర్యలు తీసుకోవాలని వారు అన్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ఈ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్ల పేరుతో జిల్లా వ్యాప్తంగా పాఠ్యపుస్తకాల పేరుతో పేద, బడుగు ,బలహీన వర్గాల విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుండి లక్షలాది రూపాయలను దోపిడీ చేస్తున్న మండల ఉన్నత విద్యాధికారులు చూసి, చూడనట్టు నిమ్మకు నీరు ఎత్తడంలా ఉండడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు .
వెంటనే గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకొని ముందస్తు అడ్మిషన్స్, పాఠ్యపుస్తకాల పేరుతో ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మండల ఉన్నత విద్యాధికారి ఆఫీస్ ముందర అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి, శేషం మహేంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి శివ,మూర్తి,పవన్ తదితరులు పాల్గొన్నారు.