ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ సేవా సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం:: నేటి మొక్కలే భవిష్యత్ తరాలకు ప్రగతి మెట్లు అవుతుందని ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ (డీసీబీసీ) స్వచ్ఛంద సంస్థ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా పట్టణంలోని కేతిరెడ్డి కాలనీ ఎల్-1 కాలనీలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలములో మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ రామ్కుమార్ అతిథిగా వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ కాలనీలో ఉన్న ప్రజలు మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతిరోజు నీరు పోసి మొక్కలను కాపాడాలని వారు తెలిపారు. అనంతరం డిసిబిసి సంస్థ గౌరవ అధ్యక్షులు గోరకాటి పెద్దారెడ్డి తోపాటు సంస్థ సభ్యులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని వారు తెలిపారు. మొత్తం మీద వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిబిసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.