రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బి. జయసింహ, డి నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం;;(శ్రీ సత్య సాయి జిల్లా) పేద ప్రజలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని రోటరీ క్లబ్ అధ్యక్షులు బి. జయసింహ, కార్యదర్శి డి. నాగభూషణ, ఉపాధ్యక్షులు కే. నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ వై. సుదర్శన్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఈ ఉచిత కంటి శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- అనంతపురం జిల్లా సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు ఆపరేషన్ కొరకు వెళ్లిన వారికి బెంగళూరులో భోజనము, వసతి, ఇతర సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పించబడునని తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ అనంతరం ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ధర్మవరం పట్టణంలో ఆనాటి నుండి నేటి వరకు 35 వేల మందికి కంటి ఆపరేషన్లతో పాటు కంటి అద్దాలను కూడా పంపిణీ చేశామని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమంలో దేశంలోనే రోటరీ క్లబ్ ముందంజలో ఉందని, విద్యార్థులకు పుస్తకాలు ఇతర సామాగ్రి బోర్వెల్స్ వేయడంలోనూ తాము ముందంజలో ఉన్నామని దేశంలో 35 వేల రోటరీ క్లబ్బులు దేశ ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందించడం గర్వించదగ్గ విషయమని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా దాతల సహాయ సహకారంతో నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈరోజు కీర్తిశేషులు చింతలూరు పద్మావతి, కీర్తిశేషులు చిందలూరు సత్యనారాయణ జ్ఞాపకార్థం వీరి కుమారులు చిందలూరు మల్లికార్జున, చిందలూరు రాఘవేంద్ర, చిందలూరు కేదార్, వారి కుటుంబ సభ్యులు ధర్మవరం వారు సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో మొత్తము 110 మంది కంటి రోగులు పాల్గొనగా అందులో 72 మంది కంటి ఆపరేషన్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రభ కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి వారు వివరించారు. తదుపరి రోటరీ క్లబ్ వారు దాత తో పాటు డాక్టర్ పద్మాను ,పిఆర్ఓ శివప్రకాష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్న శేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి, మాజీ కార్యదర్శులు శివయ్య, రామకృష్ణ, మనోహర్ గుప్తా, రమేష్ బాబు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.