విశాలాంధ్ర ధర్మవరం:: జూన్ 18వ తేదీన ధర్మవరం-నాగసముద్రం మధ్య ధర్మవరం టౌన్ కొత్తపేట గాంధీ నగర్ అండర్ బ్రిడ్జి దగ్గర రైల్వే ట్రాక్ మీద ఇనుప దూలం పెట్టిన సంఘటనలో కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఇందులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ బోయ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమానాస్పదంగా రైల్వే ప్రాంతంలో ట్రాక్ పరిసరాలలో ఉన్నటువంటి గాడే ఓబులేసు.. పెద్దపప్పూరు గ్రామము, కే శివకుమార్ గీతానగర్ ధర్మవరం వారిని పట్టుకుని విచారించగా, వారు విరివేగ రైల్వే ప్రాంతానికి వచ్చి మద్యం సేవిస్తూ ఉంటారని ఆ సేవించే క్రమంలో రైలు అటువైపు వెళుతున్నటువంటి ట్రైన్లకు రాళ్లు వేయడం ట్రాక్ మీద ఐరన్ ముక్కలు గాని రాళ్లు గాని పెట్టడం జరుగుతుందన్న విచారణలో తేలింది అన్నారు. ఈ నేరం తామే చేసినట్లు ఆ ఇరువురు ఒప్పుకున్నారని తెలిపారు. ఇంటిదగ్గర నుంచి ఐరన్ ఇనుప దూలాన్ని తీసుకొచ్చి వాటిని ట్రాక్ మీద పెట్టి అది నలిగిన తర్వాత తీసుకొని వెళ్లి దగ్గర్లో ఉన్నటువంటి స్క్రీన్ షాపులో విక్రయించాలన్న ఉద్దేశంతో చేసినట్లు వారు తెలిపారని తెలిపారు. పూర్తి విచారణ చేసిన తర్వాత ఆ సంఘటనలో ఎటువంటి కుట్రపూరితమైనటువంటి ఉద్దేశ్యం లేదని నిర్ధారించడం జరిగిందని తెలిపారు. తాగుడుకు బానిస అయినటువంటి ఇద్దరు యువకులు బాధ్యత రాహిత్యంతో దగ్గరలో ఉన్నటువంటి పాడుబడ్డ ఇంటి దగ్గరలోని పాతు ఇనుప దూలాన్ని అమ్మాలని ఉద్దేశంతో తీసుకున్న వెళుతున్న సమయంలో రైలు సమీపిస్తుందన్న వాటిని గమనించి ఆ ఇనుప దూరాన్ని వదిలేసి వెళ్లడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి పూచి కత్తుతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కానీ అనుకోకుండా ప్రమాదం జరిగి ఉంటే రైలులో వందలాది మంది ప్రయాణికులకు ఎంతో ముప్పు వాటిలేదని తెలిపారు. మొత్తం మీద కేసును త్వరితగతిన ఛేదించినందుకు జిల్లా అధికారులు అభినందించారు. తదుపరి ధర్మవరం పట్టణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఎఫ్ రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.