విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ మూర్తిరావు ఖోకలే ఆదివారం దారుణ హత్యకు గురి కావడాన్ని జీర్ణించుకోలేక ఆయన భార్య శోభా వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు రెండు రోజుల్లోనే వ్యవధిలోనే ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. వరుసగా జరిగిన ఈ రెండు ఉదంతాలు అనంతపురంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. విద్యార్థులు, అధ్యాపకులు మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతం ఆ ప్రాంతమంతా విషాద ఛాయలను అలుముకున్నాయి.