విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా చిన్న మొత్తాల పొదుపు సంఘమును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు అధికార పూర్వకంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారు కమిటీని విడుదల చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగా భీమశెట్టి కృష్ణమూర్తి-ధర్మవరం, కార్యదర్శిగా శ్రీనివాసులు- హిందూపురం, కోశాధికారిగా చలపతి- కదిరి, ఉపాధ్యక్షులుగా పని రాజ్, కట్ట వెంకటేష్ శెట్టి, నాగభూషణం, ప్రభాకర్ గుప్తా తో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికైన కమిటీ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో చిన్న మొత్తల పొదుపు సంఘం అభివృద్ధికి తమ నిరంతరం పాటుపడతామని, ఈ చిన్న ముత్తాల పొదుపుపై జిల్లా ప్రజలకు తప్పక అవగాహన కల్పిస్తూ ముందంజలో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పొదుపు సంఘం ఉద్యోగులు పాల్గొన్నారు.