విశాలాంధ్ర, ఎన్ పి కుంట: ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు ఇంటి వద్దనే అందించాలంటే వైయస్సార్సీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వైకాపా పార్టీ శ్రేణులు, అభిమానులు, రైతులు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్ మక్బూల్ అహ్మద్ పిలుపునిచ్చారు మంగళవారం మండలములోని గౌకనపల్లి పంచాయతీ గ్రామంలోని కమ్మ గుట్టపల్లి లో వైకాపా పార్టీ కన్వీనర్ కొత్త రంగారెడ్డి అధ్యక్షతన వైకాపా నాయకులు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో వైకాపాశ్రేణులు కార్యక్రమాన్ని చేపట్టారు. వైకాపా శ్రేణులు మండలంలోని కమ్మ గుట్టపల్లి ,దీన్ని మీద పల్లి గౌకనపల్లి, తూర్పు నడిమిపల్లి, ఆసం వారి పల్లి, కొవ్వూరు వాండ్లపల్లి, జవుకుల, సల్లావాండ్లపల్లి, మర్రికొమ్మ దీన్నే గ్రామాలలో నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్, వైఎస్ ఆర్ సీపీ శ్రేణులు పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గp సమన్వయకర్త మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చి చెప్పిన పథకాలన్నిటిని ప్రజలకు అందించిన ఘనత వైయస్ జగన్ కే దక్కుతుందన్నారు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను వారి ఇంటి వద్దకే చేరుస్తున్నదని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేసే విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో వైఎస్ ఆర్ సీపీ సమన్వయకర్తకు మహిళ లు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర సిఈ సి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, వజ్ర భాస్కర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు మండల వైకాపా నాయకులు ఆదిరెడ్డి, షామీర్ భాష, తిమ్మారెడ్డి ,అంజన్ రెడ్డి, వెంకటేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.