విశాలాంధ్ర ధర్మవరం:: గత ఆరు నెలల కిందట మున్సిపల్ కమిషనర్ గా గుంతకల్ నుంచి ధర్మవరానికి బదిలీగా బండి శేషన్న వచ్చారు. అతి త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను తెనాలి మున్సిపల్ కమిషనర్ గా బదిలీ వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు అభినందన, సత్కార సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వార్డ్ కౌన్సిలర్లు మాట్లాడుతూ వచ్చిన కొద్ది నెలలకే ధర్మవరం మున్సిపాలిటీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసిన ఘనత కమిషనర్ కే దక్కిందన్నారు. పట్టణ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అందరిని కలుపుకొనే పోయే విధంగా విధులు నిర్వర్తించార ని తెలిపారు. మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ ఇప్పటికే బండి శేషన్న వారి విధుల కార్యక్రమాలలో రెండుసార్లు అవార్డు రావడం వారి ప్రగతికి నిదర్శనం అని తెలిపారు. కమిషనర్ వద్ద పరిపాలన విభాగ విషయాలు తెలుసుకొనే అవకాశం మాకు లభించడం జరిగిందన్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అందరూ కలిసి బండి శేషన్నను శాలువాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బండి చేసే మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతోనే ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడపగలిగినానని, ఇందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సహాయ సహకారాలు కూడా నాకు ఎంతో సహకరించార ని తెలిపారు.