అధ్యక్ష, కార్యదర్శులు తల్లం నారాయణమూర్తి, చిన్నప్ప.
విశాలాంధ్ర ధర్మవరం:: దాతల సహాయ సహకారములతోనే మానవతా సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి చిన్నప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మానవతా సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో మానవతా సంస్థ గర్భిణీ స్త్రీలకు పండ్లు పంపిణీ, పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు, ఆరోగ్య విషయాలపై తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర విషయాలను సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తెలియజేస్తున్నామని తెలిపారు. పట్టణంలో మానవతా సంస్థను మరింత విస్తరింప చేస్తామని తెలిపారు. ఈ సంస్థలో దాతలు కూడా ముందుకు రావాలని తెలిపారు. సేవా భావంతో చేసే ప్రతి పని దైవ సేవతో సమానమని, మానవతా విలువలు కూడా పెంపొందిస్తాయని తెలిపారు. ఆసక్తిగల దాతలు సెల్ నెంబర్… 9490540321 కు గాని 8019859380కు సంప్రదించాలని వారు కోరారు.