Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తాం… ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని ప్రతి గ్రామములో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుల నాగేపల్లి లేఅవుట్ లోని జగనన్న హౌసింగ్ కాలనీలో జలజీవన్ మిషన్ పథకం కింద రూ.7.35 కోట్లతో చేపట్టిన రక్షిత తాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టిడిపి హయాంలో ధర్మవరం ప్రాంతంలో నీళ్ల కోసం ట్యాంకుల వద్ద మహిళలు కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని, ఏ అర్ధరాత్రి వచ్చే ట్యాంకర్ల కోసం నిద్రలు మాని ఎదురుచూసిన సందర్భాలను వారు గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందన్నారు. పోతుల నాగేపల్లి జగనన్న కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను, తగిన వసతి సౌకర్యాలను కూడా కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఎవరూ కూడా అమ్ముకో రాదని వారు సూచించారు. అదేవిధంగా ఆ ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం వాటిని కాపాడుకోవాలని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు వారు తెలుపుతూ, ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు తన శక్తి వంచనమేరా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ ఆర్ డబ్ల్యు. ఎస్ రషీద్ ఖాన్, డిఇ. శాంతన్న, ఏ ఈ. ప్రసాద్,పోతుల నాగేపల్లి సర్పంచ్ మౌనిక రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వేముల జయరాంరెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మేడాపురం వెంకటేష్, వెంకట్రాముడు, పురుషోత్తం రెడ్డి, సీనియర్ నాయకులు బాల్రెడ్డి, సానే నర్సింహారెడ్డి, చాంద్ బాషా, ఉడుముల రామచంద్ర, అమీర్ భాష, నర్సిరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img