Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాఠశాలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర-కవిటి: క్రీడ పాఠశాలకు రాజపురం ఆదర్శ పాఠశాల ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం ఈశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12,13 తేదీలలో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆదర్శ పాఠశాల విద్యార్థులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం స్కూల్ లో ప్రవేశం కు అర్హత సాధించినట్లు తెలిపారు. విశాఖపట్నం స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన వాలీబాల్ ఆటల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కప్ప అనూష,అంబటి సాయి,బాకీ వర్షిని ఎంపికైనట్లు తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాఠశాలకు ఎంపిక కావడం పట్ల విద్యార్థులకు, శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ ఎం నేతాజీ కి ప్రిన్సిపల్ ఎం ఈశ్వరరావు తో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img