విశాలాంధ్ర-కవిటి: మండలంలని బెజ్జిపుట్టుగ గ్రామంలో గత 14 రోజులుగా శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామివారి డోలోత్స వాలు ఆలయ ధర్మకర్తలు పొందల కృష్ణారావు,పీవీఎస్ రాంబాబు, పొందల విజయ కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సోమ వారం స్వామివారి డోలోత్సవ యాత్రలో భాగంగా దర్శనానికి భక్తులు పోటెత్తారు.మట్టి కలశాలతో పానకం నైవేద్యంగా సమర్పించారు.జిల్లా నుండే కాక ఒరిస్సా రాష్ట్రము నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు.స్వామివారి ఆలయ ప్రాంగణంలో అరటి గెలలు కట్టి భక్తుల మొక్కులు తీర్చుకున్నారు.వివాహం కాని వారు,సంతానం లేనివారు, విద్యా ఉద్యోగం లేనివారు ఆలయ మండపం ప్రాంతంలో అరటి గెలలు మొక్కులు తీర్చుకుంటారు.గత 14 రోజులుగా ఆలయం ప్రాంగణంలో స్వామివారికి విశేష పూజలు,పల్లకి సేవ, గరుడవాహన సేవ,గ్రామంలో తిరువీధుల కార్యక్రమం చేపట్టారు.సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హరికథలు,నాటికలు,కచేరీలు గ్రామస్తులతో పాటు ఇతర గ్రామస్తుల ఆర్థిక సహాయంతో చేపట్టారు.ఈ యాత్ర జరిగే స్థలం ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఆలయ ధర్మకర్తల తో పాటు కవిటి ఎస్ఐ రాము తగు జాగ్రత్తలు తీసుకున్నారు.