Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

జీడితోటల్లో అగ్ని ప్రమాదం..

అగ్నిప్రమాద బాధితులకు నష్ట పరిహారం అందజేయాలి : జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి

విశాలాంధ్ర సంతబొమ్మాళి ( శ్రీకాకుళం) : ఆఖరిరోజు అయిన శుక్రవారము ఎన్నికల ప్రచారంలో భాగంగా జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావు నౌపడ పాలనాయుడుపేట నుంచీ సున్నాపల్లి వెళుతుండగా, మధ్యలో పాలనాయుడుపేట జీడితోటల్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడంతో యువకులు తమ వంతుగా శ్రమపడి దగ్గర్లో ఉన్న నీటితో మంటలు ఆర్పారు.ఫోన్లు చేసి అగ్నిమాపక కేంద్రాన్ని రప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరమేశ్వర రావు మాట్లాడుతూ, రైతాంగం అనుకోకుండా జరిగే ప్రస్తుతం జీడిపంట వచ్చిన తరుణంలో అగ్నిప్రమాదం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని, అధికారులు తక్షణమే స్పందించి అగ్నిప్రమాద బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని కోరారు. అటుతరువాత ప్రచారం కార్యక్రమముకు వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img