విశాలాంధ్ర సంతబొమ్మాళి ( శ్రీకాకుళం) : జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీబీసీఐడీ డెరైక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ ను,టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావు బుధవారము కలిసారు. ఎన్నికల అనంతరం , ఓటింగ్ సరళిని వివరంచారు.టెక్కలి నియోజకవర్గంలో తనకు ఎమ్మేల్యే టికెట్టు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని, అలాగే నియోజక వర్గంలో ఉన్న ప్రజలు తన ప్రచారం చేస్తున్న సమయంలోనే అడుగడుగున మంగళహారతులు నీరాజనాలు, పూలమాలలు తో ఆహ్వానం పలికి, ఆదరించి, అభిమానించిన అందరకీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. జేడీ లక్ష్మీనారాయణ ను కలిసిన వారిలో జై భారత్ జాతీయ పార్టీ నాయుకులు, అభిమానుల ఉన్నారు.