విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బెజ్జిపుట్టుగ గ్రామంలో వెలసివున్న శ్రీదేవి,భూదేవి సమేత శ్రీ చక్ర పెరుమాళ్ళ స్వామి వారికి కవిటి గ్రామం కు చెందిన బెందాలం జగన్ మిత్ర,వల్లి శ్రీ కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో గరుడ వాహన సేవ గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు సత్యనారాయణ స్వామి,రాజు స్వామి, రాజేష్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు,సుప్రభాత సేవ,నిత్య హోమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పి కృష్ణారావు,పి వి ఎస్ రాంబాబు,పి విజయ్ కృష్ణ,బెందాలo వెంకటేశ్వరరావు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.