Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కన్ను పడితే చాలు కబ్జా చేయాల్సిందే,,,!


*బినామీ పేరున రెండు కొండలు స్వాహా,,,

  • అసైన్మెంట్ కమిటీ ఎక్కడ
  • మామూళ్ల మత్తులో అధికారులు
    విశాలాంధ్ర – ఆముదాలవలస(శ్రీకాకుళం) : కన్ను పడితే చాలు ఎంత ఖర్చయినా సరే సొంతం చేసుకోవాల్సిందే. అది కొండైన వాగైనా వంకైనా తమ సొంతం కావాల్సిందే. మున్సిపాలిటీ పరిధిలోని రెండు ఎర్ర కొండలు మధ్యలో తాటి కర్ర చెరువు తమ వశం చేసుకునేందుకు కొందరు పావులు కదిపారు. ఎనిమిది నెలల తరువాత వారి ఆశలకు రూపం దక్కింది. వీటన్నింటికీ సూత్రధారులు వెనుక ఉండి కార్యము నడిపించినట్లు విమర్శలు ఉన్నాయి. అధికారులు వారికి అందిన తైలం బరువుతో ఆక్రమణదారుల ఫైలుపై సంతకాలను కూడా చేయడానికి సిద్ధపడినట్లు తెలిసింది. కొండైన బండైన చివరకు వాగులు వంకలు ఆక్రమణకు కాదేది అన్నట్టు కబ్జాదారులు దురాక్రమణలు చేస్తున్నారు. నేతల కనుసన్నలలో స్కెచ్ వేసి ప్రభుత్వ భూములను కొట్టేస్తున్నారు అన్న విమర్శలకు కొన్ని నిజాలు ఉదాహరణలుగా మారుతున్నాయి. రెవెన్యూ అధికారుల మాయాజాలంతో కొండలు సైతం ఆక్రమణదారుల చేతులలో పిండి అవుతున్నాయి. పట్టణంలోని జగ్గు శాస్త్రాలు పేట, తాళ్లవలస, తిమ్మాపురం ప్రాంతాలలో ఉన్న ఎర్ర మట్టి కొండలు బినామీల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మత్తులో అధికారులు జోగుతున్నట్లు ఈ వ్యవహారం తెలిసిన వారు ఆరోపిస్తున్నారు. గత ఏడాది జూన్ నెలలో ఇంటింటికి మంచినీటి కొళాయి ఏర్పాటు తాళ్లవలసలో చేశారు. ఆ సమయంలో నేతల వెనుక ఉన్న బినామీలు ఆ ప్రాంతాల ను పరిశీలించారు. అప్పటినుండి కొండపై కన్నేసి వసుపరు చుకున్నట్లు తెలుస్తోంది. తాళ్ల వలస జగ్గు శాస్త్రుల పేట పరిధిలోని ఫీల్డ్ నెంబర్ 34 లో నాలుగు ఎకరాల రెండు సెంట్లు కొండ ప్రాంతం వుంది. అలాగే తిమ్మా పురం ర్యాంపు ఆనుకొని ఫీల్డ్ నెంబర్ 20లో రెండు ఎకరాల 38 సెంట్లు ఎర్ర కొండ ఉంది. ఈ రెండింటికి మధ్యన తాటి కర్ర చెరువు ఉంది. ఈ మొత్తం పై కన్నేసిన పొందూరు మండలానికి చెందిన వ్యక్తి తన అనుచరుని పేరు మీద ఆ ప్రాంతాన్ని స్వాహా చేసేందుకు పావులు కదిపారు. అధికార పార్టీ నాయకు డిగా చెప్పుకునే వ్యక్తి కావడంతో రెవిన్యూ అధికారులు కూడా తలవంచి నట్లు తెలి సింది. మొదట కొంత బెట్టు చేసినప్పటికీ ఆ అధికారిని బదిలీ అయిన తర్వాత మళ్లీ ఫైలు పుటప్ చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కొంత మంది అధికారులను బదిలీలు చేశారు. ముందుగా ఫైలు పూర్తయిన తర్వాతే రిలీ వింగ్ అందుతుందని కొంతమంది బినామీలు బెదిరించడంతో తలొగ్గి నట్లు తెలిసింది. ఇదే సమయంలో అందనికాలకు తిరువూరు దిగువ స్థాయి అధికారులు ద్వారా వసూళ్ల పర్వం పూర్తి చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

అసైన్మెంట్ కమిటీ ఎక్కడ,,,,

ప్రభుత్వ భూములను ఇవ్వాలన్న, పేదలకు పట్టాలు ఇవ్వాలన్న, ఇంకే ఇతర అవస రాలకు అందించాలన్న అసైన్మెంట్ కమిటీ తీర్మానం ఉండాలి. వైసిపి ప్రభుత్వం ఏర్పా టు అయిన తర్వాత పట్టణంలోని ప్రభుత్వ భూములు చెరువులు, బండలు, అక్రమునకు గురికాకుండా నియంత్రించేందుకు కమిటీని వేశారు. ఈ కమిటీలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గాను ఎమ్మార్వో, పోలీస్ అధికారులు తో కమిటీ ఏర్పడింది. రెవిన్యూ శాఖలో మాత్రం ఇప్పటివరకు అటువంటి కమిటీలు లేవు. అంతేకాకుండా గతంలో మాదిరి ఫుడ్ కమిటీ కూడా లేదు. వీటన్నింటినీ సచివాల యం, వాలంటరీ వ్యవస్థ ద్వారా కార్యకలా పాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలు పుతున్నారు.

తాటి కర్ర చెరువు ఏమైనట్లు

రెండు ఎర్ర కొండలు ఉండడం తాటికర చెరువు పురపాలక సంఘ పరిధిలో ఉండేది. ఉపాధి హామీ పనులు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలు పె ట్టారు. కేవలం గ్రామీణ ప్రాంతాలకే ఆ పథ కాన్ని వర్తింప చేసింది కేంద్ర ప్రభుత్వం. అయి తే ఆ ప్రాంతంలో ఉన్న బొబ్బిలి పేట రైతుల కు సాగునీరు అందించేందుకు వీలుగా ఆ చెరువును కూడికలు తీసి రైతులు అందించే క్రమంలో అది హామీ కూలీలతో పనులు చేయించారు. అప్పట్లో అక్కడ రెవెన్యూ రికార్డులు మార్పుకు బీజం పడింది. ఆ క్రిందిన ఉన్న సాగు భూములకు నిరంధించే తాటి కర్ర చెరువు గ్రామీణ ప్రాంతాల పర మైంది. అప్పటి జీవోలను వెలికి తీసి ఇప్పు డు బినామీ పేరున ఆ కొండలను ధకల పరిచినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎర్ర కార చెరువు రూపురేఖలు పూర్తిగా మారిపోయా యనే చెప్పాలి. రెవెన్యూ అధికారులు వారు చేసిన తప్పులకు అనుకూలంగా వీటన్నింటినీ రికార్డులలో మార్పు చేసుకున్నట్లు దిగువ స్థాయి సిబ్బంది రుసరుసులాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం నడిపించడంలో ఇద్దరు అధికారులు ఓ అధికార పార్టీ కార్య కర్త చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ అధి కారుల చేతుల మీదుగానే లక్ష రూపాయలు చేతులు మారాయి అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బినామీల పేరున రెండు కొండలు,,,,,

ఓ బినామీ పేరున ఆరు ఎకరాల 40 సెంట్లు విస్తీర్ణం కల రెండు కొండలను అందించేందు కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ మాయాజాలంతో ఎక్స్ సర్వీస్ మెన్ పేరున వీటిని బదలాయించినట్లు వినవొస్తుంది. ప్రభుత్వ భూమిని ఇతరులకు అందించే క్రమంలో నిబంధనలు పాటించాల్సి ఉంది. అటువంటి కమిటీలు రెవెన్యూ పరిధిలో అధికారికంగా కనిపించడం లేదు. అధికార పార్టీ కార్యకర్త చక్రం తిప్పడంతో ఇద్దరు అధికారులు మాయాజాలం తో రెండు కొండలతో పాటు తాటి కర్ర చెరువు కూడా అక్రమార్కుల చెరలో పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బొబ్బిలి పేట, తిమ్మాపురం సాగు భూములకు నీరు అందించే వాగులను చెరువులను దురాక్రమకు గురైతే ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆ ప్రాంత రైతులు ముక్తకంఠంతో అంటున్నారు. ప్రభుత్వ భూములను అప్పనంగా ఇత రులకు కట్టు పెట్టడంలో ఈ ఎంతటి అధికారి హస్తం ఉన్న ఉన్నతాధికారుల చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని తదితరులు చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ విషయమై తాసిల్దార్ కే వేణుగోపాల రావును వివరణ కోరగా తాను ఇటీవల ఛార్జ్ తీసుకున్నానని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఫోటో,,, తాళ్లవలస వద్ద ఉన్న ఎర్ర కొండ, ప్రభుత్వ రికార్డులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img