-కాలిఫోర్నియాకు ఎనర్జీ కమిషన్ చైర్మన్ గుండ శివ గంగాధర్
విశాలాంధ్ర – శ్రీకాకుళం టౌన్ : మాతృభూమి గొప్పదనాన్ని దేశ విదేశాల్లో చాటిచెప్పే అరుదైన ఘనత తమకు లభించిందని , దీనికి కారకులు తమ తల్లి దండ్రులు , కుటుంబ సభ్యులేనని శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే తనయుడు కాలిఫోర్నియాకు ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా ఇటీవల నియమింపబడిన గుండ శివ గంగాధర్ అన్నమాటలు …ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంసృతి సంప్రదాయాలు చాటిచెప్పేందుకులు తమకు ఒక ప్రత్యేక పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేసారు . ప్రపంచ దేశాలకు భారత్ గొప్పదనాన్ని తెలియజేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు . రాజకీయాల్లో ఎంతో నైతికత కలిగిన కుటుంబం నుండి వచ్చిన తాను విదేశాల్లో స్థిర పడి జన్మభూమి వైభవాన్ని తెలియజెప్పే భాగ్యం దొరికిందన్నారు . ఒక భరతమాత బిడ్డగా తమకు కాలిఫోర్నియా నగరానికి ఎంతో కీలకమైన ఎనర్జీ కమిషన్ చైర్మన్ గా నియామకం పొందడం తన పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నారన్నారు . నాలుగు ఏళ్ల విరామం అనంతరం స్వదేశంలో అడుగుపెట్టేబాగ్యం లభిచిందని స్వదేశం లో సొంత ఇల్లు అయినా అరసవల్లి చేరుకున్న సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది ప్రముఖులు స్వచ్చంధ సేవకులు వివిధ రాజకీయ పార్టీల నేతలు తమకు అపూర్వ స్వాగతం పలకడం జీవితంలో మరిచిపోలేని ఘటనగా అయినా పేర్కొన్నారు . తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపంగా పేరుగాంచిన గుండ అప్పలసూర్యనాయన , లక్ష్మి దేవి దంపతులకు తాను జన్మించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు . ఎనర్జీ అన్నది అమెరికాకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రంగం కాబట్టి నిష్ణాతులైన శివ గంగాధర్ భవిష్యత్తులో ఆ రంగంలో వారికీ ఉండే నైపుణ్యం లో మన దేశ అవసరాలకు కూడా అవసరం అవుతుందని ఆ రంగ నిపుణులు తెలియ జేస్తున్నారు . అనంతరం శ్రీకాకుళం నగరం అరసవల్లి తన స్వగృహంలో సీనియర్ జర్నలిస్ట్ , జీ న్యూస్ ఎడిటర్ రత్నాల నరసింహ మూర్తి దుశ్శాలువతో సత్కరించారు . ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జ్ బుక్క యుగంధర్ , శిమ్మ నరసింగరావు , మెండ గిరీష్ , గోవింద , రాంబాబు ,ఉంగటి రమణ , రామారావు , తదితరులు ఉన్నారు .