రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్
హైదరాబాద్ నగరంలో ఉప్పుగుడ పరిధిలోని పరివార్ కాలనీలో నిర్వహిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, నగరంలో 100శాతం అర్హులైన వారికి చేపట్టిన కొవిడ్ టీకా కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు.పదిరోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. అవసరమైతే పొడగిస్తామన్నారు.ఇళ్లలో ఇంకా మిగిలిన వారికే ఈ ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ నగరంలో చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు.