Monday, May 20, 2024
Monday, May 20, 2024

యాసంగి పంటను కొంటామని కేంద్రంతో ప్రకటన చేయించండి..

బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌

బీజేపీ నేతలు మోనగాళ్లే అయితే యాసంగి పంటను కొంటామని కేంద్రంతో ప్రకటన చేయించాలని.. అంతవరకు దీక్ష చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు యాసంగి పంట కొనుగోలుపై ప్రకటన చేయించాలన్నారు.లేదా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ బండి సంజయ్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ కేంద్రాన్ని ఒప్పిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఈ విషయంపై తేల్చి చెప్పాలన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే బీజేపీ దొంగ దీక్షలు చేస్తోందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img