Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రాజీవ్‌ మార్గాన్ని అనుసరిస్తాం

. ధాన్యానికి రూ.500 బోనస్‌తో మొదలుపెట్టాం
. మొలకెత్తిన వడ్లనూ కొనుగోలు చేస్తాం
. మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించక… రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోందని బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు గాలి మాటలు మాట్లాడడం సరైంది కాదన్నారు. గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదనే విషయాన్ని వేలాది మంది రైతులు నా పాదయాత్ర సమయంలో గోడు వెళ్లబోసుకున్నారని వివరించారు. మొలకెత్తిన ధాన్యం సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని… ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అన్నారు. ఇక ధాన్యానికి బోనస్‌ విషయానికి వస్తే సన్నాలకు రూ.500 ల బోనస్‌ తో ఈ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. వరి వేస్తే ఉరే అని నాటి సీఎం కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు.
భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దుష్టశక్తు ల చేతిలో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ రంగాన్ని ముందు చూపుతో రాజీవ్‌ గాంధీ ఆచరణలో పెట్టారన్నారు. యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయి ఎంత ధాన్యం కొనుగోలు చేశాం ఇలాంటి సమాచారం క్షణాల్లో తెలుసుకుంటున్నామని… దీనికి కారణం రాజీవ్‌ గాంధీ చూపిన మార్గమేనన్నారు. ప్రజా అవసరాలను తీర్చడంలో రాజీవ్‌ గాంధీ మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img