Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

10 వర్సిటీలకు వీసీల నియామకం

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్లను నియమించింది. ఈ మేరకు మంగళవారం సర్కారు అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు సతీమణి శైలజా రామయ్యర్‌ కూడా ఉన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ వీసీగా ప్రభుత్వం నియమించింది. ఇక వివాదాస్పదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్‌ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్‌ రంజన్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ వీసీగా ప్రభుత్వం నియమించింది
కొత్తగా నియమితులైన వీసీలు వీరే…
ఉస్మానియా యూనివర్సిటీ- దాన కిషోర్‌, తెలంగాణ యూనివర్సిటీ- సందీప్‌ సుల్తానియా, పాలమూరు యూనివర్సిటీ- నదీం అహ్మద్‌, కాకతీయ యూనివర్సిటీ-కరుణ వాకాటి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ-శైలజా రామయ్యర్‌, జేఎన్‌టీయూ-బుర్రా వెంకటేశం, మహాత్మాగాంధీ యూనివర్సిటీ-నవీన్‌ మిత్తల్‌, శాతవాహన యూనివర్సిటీ-సురేంద్రమోహన్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ-జయేష్‌ రంజన్‌, అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ-సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ నియమితులయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img