సెప్టెంబర్ 2న తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2న జెండా పండుగ కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఇదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఢల్లీిలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు. ఆ రోజు నుంచి గ్రామ, పట్టణ కమిటీల నిర్మాణం పది రోజుల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.తర్వాత వారంరోజుల లోపల టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ కార్యవర్గాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు. తర్వాత జిల్లా కార్యవర్గంతోపాటు, కొత్తగా రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు.