తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్ఉ1, పేపర్ ఉ2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఈ మేరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 16వ తేదీ దాకా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒక్కో పరీక్ష ఫీజు రూ.400.
పేపర్ఉ1 పరీక్షను డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకునేందుకు అవకాశం కల్పించారు. బీఈడీ చేసిన వాళ్లు రెండు పేపర్లను రాసుకోవచ్చు. ఈ సారి టెట్ పరీక్షకు 2 లక్షల నుంచి రెండున్నర లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15న పరీక్ష నిర్వహించిన అదే నెల 27న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.