Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రామకృష్ణ ను విమర్శించే అర్హత మీకుందా..?

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మండిపాటు
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణను విమర్శించే అర్హత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి లేదని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఐ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీవత్స లాడ్జిలో వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే రామకృష్ణను విమర్శించే స్థాయి తోపుదుర్తికి లేదని వారు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రామకృష్ణ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జిల్లాలో ఎక్కడున్నారో గుర్తు చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యేగా రామకృష్ణ ఉన్నపుడు తోపుదుర్తి గ్రామానికి బీటీ రోడ్డు వేశారని వేలాదిమంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అదేవిధంగా పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద ఉన్న 49 చెరువులకు నీళ్లు తెచ్చిన ఘనత రామకృష్ణ దేనిని వారు తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు పది టీఎంసీల నీటి కోసం పోరాటం చేసి రామకృష్ణ జైలు కూడా వెళ్లారని ఆ ఉద్యమ ఫలితంగానే అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసి న్యాయం చేసిందని తెలిపారు. మరి రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ప్రజల కోసం ఏమి చేశారని? వారు సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలను తిడితే పదవులు ఇస్తారని టిక్కెట్ వస్తుందని ప్రకాష్ రెడ్డి సిపిఐ నీ విమర్శించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. మరి ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ లక్ష ఎకరాలకు నీరు ఇస్తానన్న మాట ఏమైందని? ఒక్క ఎకరాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదే అని వారు మండిపడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దౌర్జన్యాలు మరోసారి బహిర్గత మయాయని జగనన్న కాలనీలో పశ్చిమ బెంగాల్ కార్మికులను నిర్బంధించడంపై ఆ రాష్ట్ర పార్లమెంటు సభ్యుడు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఎస్పీకి లేఖ రాయడం జరిగిందన్నారు. ముందు ఆ ఘటనపై ప్రకాశ్ రెడ్డి సంజాయిషీ చెప్పాలన్నారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అక్రమాలను దౌర్జన్యాలను బహిర్గతం చేసే పత్రికల పైన, రామకృష్ణ పైన విమర్శలు చేయడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు. రామకృష్ణ 1994లో ఎమ్మెల్యేగా జిల్లా ప్రజలకు అనేక పోరాటాలు చేసి ప్రజలకు సమస్యలు పరిష్కరించడంలో కీలకపాత్ర వహించారని తెలిపారు. రామకృష్ణ పోరాటం గురించి తెలియకపోతే వైసీపీలోని సీనియర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలను తిడితే సీటు వస్తుందని నువ్వు కూడా తిడుతున్నావని తెలిపారు. కమ్యూనిస్టులపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని వారు హెచ్చరించారు. ఇటీవల ఎస్కే యూనివర్సిటీలో గల ఐదు ఎకరాల భూమిని రాప్తాడు ఎమ్మెల్యే వారి అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే ఆ భూములను కాపాడడానికి నెల రోజులు ముందు ఏఐఎస్ఎఫ్ తీవ్ర పోరాటం చేయగా, సమాచారం అందుకున్న రామకృష్ణ ఎస్.కె యూనివర్సిటీని సందర్శించారు దీంతో ఆ ఐదు ఎకరాల భూములు ఎస్కే యూనివర్సిటీకి తెలిపారు. అక్కసు తోనే రాప్తాడు ఎమ్మెల్యే ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా అనంతపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు రామకృష్ణ విశేష కృషి చేయడం జరిగిందని, ఆ ఘనత రామకృష్ణకి దక్కిందని తెలిపారు. అనంతరం సిపిఐ రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. మధు మాట్లాడుతూ అనంతపురంలోని జగనన్న కాలనీలో పనిచేస్తున్న తొమ్మిది మంది బెంగాల్ కూలీలను కిడ్నాప్ చేసి చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? అని వారు ప్రశ్నించారు. ఆ కూలీలను రక్షించాల్సిన పోలీసులు ఎమ్మెల్యే అనుచరులుగా పనిచేయడం దారుణమని తెలిపారు. అందుకే ఈ విషయంపై న్యాయ విచారణ జరపాలని రామకృష్ణ బహిరంగంగా బిజెపిని అడగడం జరిగిందని వారు తెలిపారు. జగనన్న కాలనీ కాంట్రాక్టర్ ప్రకాష్ రెడ్డి డబ్బు డిమాండ్ చేశాడని ఇవ్వకపోతే కూలీలను పోలీసుల సహకారంతో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్బంధించారని వారు తెలిపారు. రామకృష్ణను విమర్శించేముందు నీ సాయి ఏదో తెలుసుకోనని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జే. వి. రమణ, సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు మహదేవ్, కనగానపల్లి మండల కార్యదర్శి మల్లికార్జున, రామగిరి మండల కార్యదర్శి ముత్యాలప్ప, చేనేత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటస్వామి, వెంకటనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, సహాయ కార్యదర్శి వై. రమణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు సకల రాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img