Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఉంగుటూరులో రాజకీయం వేడెక్కింది…

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ, టిడిపి,జనసేన,బిజెపి
విశాలాంధ్ర – ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ఉంగుటూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు నియోజవర్గం నుండి పోటీ చేయడానికి పలు రాజకీయ నాయకులు పోటీకి సిద్ధమయ్యారు. అధికారికంగా ఇప్పటివరకు ఏ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోయినా ఎవరికి వారు ఎన్నికల ప్రచారంలో చేసుకుంటున్నారు.
అధికార పార్టీ వైసీపీ తరఫున పుప్పాల వాసు బాబు టిక్కెట్టు దాదాపు ఖరార్ అయినట్లు ప్రచారం సాగుతున్నది. పొత్తులో టిడిపికి టిక్కెట్ ఇస్తే గన్ని వీరాంజనేయులు, జనసేనకు ఇస్తే పత్స మట్ల ధర్మరాజు పోటీ చేస్తారు. బిజెపి తరఫున ఆ పార్టీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీ రాణి పోటీ చేస్తామని మాలతీ రాణి తెలిపారు . గత ఆరు నెలల నుండి ఉంగుటూరు నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం లో గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాసు బాబు నియోజకవర్గంలో నాలుగు మండలాలలో పాల్గొంటూ ప్రజలను మన్నలను పొందుతున్నారు.అభివృద్ధి, నిజాయితీ నా నినాదం అని వాసు బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే టిడిపి, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు పొత్తులో ఎవరికీ టిక్కెట్ కేటాయించకపోయినా ఇరు పార్టీ అభ్యర్థులు వేరువేరుగా నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మన ఇంటికి మన గన్ని కార్యక్రమంతో పాటు, రచ్చబండ కార్యక్రమం చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఉండగా నియోజవర్గానికి చేసిన అభివృద్ధి తన నినాదం అంటున్నారు. అంతేకాకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు జనంలోనికి జనసేన పార్టీ కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం లో దూసుకుపోతున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం తో పాటు ద్వారకాతిరుమల కాలినడక వెళ్లే భక్తుల కోసం ఉంగుటూరు మండలం గోపీనాథ్ పట్నం వద్ద లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ భక్తులకు నిత్యం భోజనం, టిఫిను వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఉంగుటూరు నియోజవర్గంలో ఉంగుటూరు,గణపవరం,భీమడోలు. నిడమర్రు మండలాలలో తాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా అక్కడకు ధర్మరాజు శ్రీ లక్ష్మీ నారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారు. మంచినీటి సరఫరా నిరాటంగా కొనసాగుతుంది. నియోజవర్గంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసి యువతను తన వైపు తిప్పుకున్నారు. సేవా కార్యక్రమాలు, ప్రజల మన్నలను , యువత జనసేన వైపే ఉన్నారని ధర్మరాజు అంటున్నారు. బిజెపి తరఫున ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీ రాణి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పనులు నినాదంతో మాలతి రాణి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. నేను బిజెపి తరఫునఉంగుటూరు అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని ఆమె విశాలాంధ్ర విలేఖరికి తెలిపారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో నాలుగు పార్టీలు వారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్లి వారి పార్టీ మేనిఫెస్టోలో వివరించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే అభ్యర్థులను ఏ పార్టీ ప్రకటించలేదు. చివరికి టిక్కెట్లు ఎవరికి వస్తాయో వేచి చూద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img