సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : రాయదుర్గం పట్టణంలోని కనేకల్ రోడ్ లో ఉన్న జామియా మహమ్మదీయ అరేబియా కళాశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ శనివారం ఒక ప్రకటన ద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శుక్రవారం రాత్రి భోజనం చేసిన మదరస విద్యార్థులకు వాంతులు, విరేచనాలు జ్వరాలు రావడంతో గుర్తించిన సిబ్బంది ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ముందుగానే వర్షాలు వచ్చినాయి. సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక జిల్లా కలెక్టర్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సిపిఐ జిల్లా సమితి కోరుతున్నామన్నారు. నీటి వల్ల ,ఆహారం వల్ల, వాంతులు విరేచనాలతో అడ్మిట్ అయిన మదరసా విద్యార్థులకు వెంటనే చికిత్స అందించడం ద్వారా కొంతమంది కళాశాలకు వెళ్లడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి నాణ్యమైన వైద్యం అందించి త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.