విశాలాంధ్ర ధర్మవరం::: నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సతీమణి సుప్రియ మరోసారి తన మానవతను చాటుకుంది. పట్టణంలోని 27వ వార్డు వైయస్ కాలనీలో శివాలయములో 23వ తేదీన శివపార్వతుల కళ్యాణం ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళ్యానం రోజున అన్నదాన కార్యక్రమానికి గాను తనవంతుగా 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీ వారికి నగదును అందజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందజేయుట, పేద విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారికి ల్యటాప్ ను అందించుట, ఒంటరి మహిళలకు, అనాధలకు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు సుప్రియకు కృతజ్ఞతలను తెలియజేశారు.