మండల కో ఆప్సన్ సభ్యుడు నాజర్ వల్లి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మైనారిటీల సంక్షేమానికి మీరిచ్చే సహకారం మరువలేనిదని మండల కో ఆప్సన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన ఆమెకు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు శాసన సభ్యురాలిగా గెలిచిన నాటి నుంచి నేటి వరకు మైనార్టీ సంక్షేమానికి ఇచ్చిన సహకారాన్ని మరువలేమన్నారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లోనూ తమ సంక్షేమానికి మరిన్ని నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు.