విశాలాంధ్ర-ఆనందపురం : సార్వత్రిక ఎన్నికలు 13వ తేదీ రాత్రి రెండు గంటల వరకు కూడా ఆనందపురం మండలంలో కొన్ని పోలింగ్ బూత్ లలో పోలింగ్ కొనసాగింది అందులో భాగంగా, ఆనందపురం పొడుగు పాలెం, గొట్టిపల్లి, సొశీట్యము, ఆనందపురం, ఇంకా మరికొన్నిచోట్ల పోలింగ్ కొనసాగింది కొన్ని ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఓటు వేసే వ్యక్తులు చాలా ఇబ్బంది పడ్డారు అలాగే ఎలక్ట్రానిక్ మిషన్లు మురాయింపు లేటుగా మొదలు కావడం గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఉదయం వేళల్లో ఆసక్తి సరిగా చూపించకపోవడం ఏమాగా జరిగింది. ఏదేమైనా అప్పటికి కూడా మండలంలో పోలింగ్ సుమారు 80 శాతం పైనే జరిగిందని చెప్పవచ్చు.