సాయి గణపతి లో ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు
యువత మేధస్సు అపారం, వారి ఆలోచనలు అద్భుతం
విశాలాంధ్ర – ఆనందపురం : గురువులు వారి ఆలోచనలను మెరుగులు దిద్దితే నవ్య ఆవిష్కరణలు ఎన్నో మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ కే నారాయణరావు అన్నారు.ఆనందపురం మండలం గిడిజాల లోని సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాలలో పాలిఫెస్ట్ 2కె24 ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీతకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో దోహదపడతాయి అన్నారు.కళాశాల కరస్పాండెంట్ ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించేందుకు విద్య తో పాటు ప్లేస్మెంట్కు ఉపకరించే సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్ మహేశ్వర రావు మాట్లాడుతూ విద్య, శాస్త్ర,సాంకేతిక ,నూతన ఆవిష్కరణ అనే నాలుగు దేశ ఆర్థిక పురోగతికి వెన్నుముకలాంటిమని అన్నారు.అనంతరం మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,కంప్యూటర్స్ విభాగాలకు చెందిన 180 వర్కింగ్ మోడల్స్ను తిలకించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సుమారు 2000 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి ప్రాజెక్టులను తిలకించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అమరేంద్ర కుమార్ విభాగాధిపతులు సత్యవతి, రాజేంద్ర, స్వరూప, అరుణ,సోమేశ్వరరావు, శ్రావణి పలువురు అధ్యాపకులు ఉన్నారు.