Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

64 ఏళ్ల వ‌య‌సులో… డిప్యూటీ స్పీక‌ర్ సాహ‌సం

గంట పాటు నీటిపై తేలియాడే యోగాస‌న ప్ర‌క్రియ సాధ‌న‌
హాజ‌రైన మంత్రి బొత్స‌, స్పీక‌ర్ త‌మ్మినేని, డిప్యూటీ సీఎం రాజ‌న్నదొర‌

విశాలాంధ్ర -విజ‌య‌న‌గ‌రం : విజ‌య‌న‌గ‌రం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి త‌న వ‌య‌సును సైతం లెక్క చేయ‌కుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధ‌న చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌కితుల‌ను చేశారు. క్రీడా రంగ విశిష్ట‌త‌ను, క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను నేటి యువ‌తరానికి తెలియ‌జేయాల‌నే సంక‌ల్పంతో ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా సాగింది.జాతీయ‌ స్విమ్మింగ్ పూల్ డేను పుర‌స్క‌రించుకొని మంగ‌ళ‌వారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులోని స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీక‌ర్ నిర్వ‌హించిన జ‌లాస‌న ప్రక్రియ అట్ట‌హాసంగా జ‌రిగింది. రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర‌, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.క్రీడల ఆవ‌శ్య‌క‌త‌ను తెలుపుతూ డిప్యూటీ స్పీక‌ర్ నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మం భావిత‌ర క్రీడాకారుల్లో త‌ప్ప‌కుండా స్ఫూర్తి నింపుతుంద‌ని.. చైత‌న్యం తీసుకొస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. డిప్యూటీ స్పీక‌ర్ చేప‌ట్టిన‌ సాహ‌సాన్ని అభినందించారు.

క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేయాల‌న్న‌దే నా ఉద్దేశం : డిప్యూటీ స్పీక‌ర్

జ‌లాస‌నం వేసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి క్రీడ‌ల ప్రాధాన్య‌త‌ను నేటి యువ‌త‌రానికి తెలియ‌జేయాల‌న్నదే త‌న ముఖ్య ఉద్దేశ‌మ‌ని అందుకే ఈ వ‌య‌సులో కూడా ఇలాంటి సాహ‌సాన్ని చేశాన‌ని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో ప‌డి యువ‌త క్రీడ‌ల‌కు దూరం అవుతున్నార‌ని వాటి ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకొని క్రీడల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్నో ప్ర‌యోజ‌న‌క‌ర నిర్ణ‌యాలు తీసుకుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. త‌న వంతుగా న‌గ‌రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని వివ‌రించారు. మహిళ‌ల కోసం ప్ర‌త్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్య‌త ఇస్తూ నిత్యం క్రీడా సాధ‌న చేయాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ హిత‌వు ప‌లికారు. వ‌య‌సుతో సంబంధం లేని క్రీడ‌.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధ‌నం చేయ‌టం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు.

కార్య‌క్ర‌మంలో రాష్ట్ర శాస‌న స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజ‌న్న‌దొర‌, విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాసు, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, బొత్స అప్ప‌ల‌న‌ర‌స‌య్య‌, న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img