విశాలాంధ్ర,సీతానగరం: మండలంలో పలు పంచాయతీలో శుక్రవారం నుండి ప్రారంభ మైన ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమంలో బిఎల్ఓలతో టీడీపికు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొని పరిశీలన చేస్తున్నట్లు మండల టీడీపీ అధ్యక్ష,కార్యదర్శులు కొల్లి తిరుపతిరావు రౌతు వేణుగోపాలనాయుడులు తెలిపారు. పలు గ్రామాల్లో తాము పాల్గొని ఆయా గ్రామాల బిఎల్ఏ లకు తగు సూచనలు సలహాలను ఇస్తున్నట్లు చెప్పారు. పార్టీ అదేశాలు మేరకు ఈకార్యక్రమానికి అత్యంత ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.