విశాలాంధ్ర – భోగాపురం : (విజయనగరం జిల్లా) చదవాలనే పట్టుదల విద్యార్థి లోను, ప్రతిభను గుర్తించి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తపన చదువు చెప్పే గురువు లోనూ ఉంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్న విజయం సాధించడం తథ్యం అని నిరూపించారు. భోగాపురం మండలంలో ముక్కాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎనిమిదో తరగతి చదువుతున్న బొడ్డు లక్ష్మి ఇటీవల జాతీయ స్థాయిల నిర్వహించిన ఎన్ ఎన్.ఎం.ఎస్ పరీక్షలో ప్రతిభ కనపర్చి సత్తా చాటింది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచినందుకుగాను నాలుగు సంవత్సరాలు పాటు ఏడాదికి 12,000/-రూపాయలు చొప్పున ఉపకార వేతనం కేంద్ర ప్రభుత్వము అందించనుంది. మారుమూల పేద మత్స్యకార కుటుంబానికి చెందిన విద్యార్థిని ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ప్రశంసించారు. విద్యార్థి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు గేదె నర్సింగ్ రావు తో పాటు ఉపాధ్యాయులు ఎస్. భవాని, ఎస్. నలిని, ఎల్. పార్వతి దేవి, కె. లక్ష్మణరావు, జె. గణపతి, వై. మల్లికార్జున్ రావు, ఈ. అనసూయ, పి. సూర్యకాంతం, వి. కృష్ణ,, లక్ష్మి అభినందించారు. మండల విద్యాశాఖ అధికారులు ఎం. రమణమూర్తి, బి. చంద్రమౌళి, సి.ఆర్.ఎం.టి ఎం. శేషుబాబు విద్యార్థిని అభినందించారు.