విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రంలో శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారంనాడు ఓంనమో శ్రీలక్ష్మినరసింహస్వామి,
ఓంనమోనారాయణాయ, ఓంనమో
శ్రీవేణుగోపాలస్వామియే నమః అంటూ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.ప్రతీ గురువారం ముడుపుల పూజలకు వేకువ జామునుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున విచ్చేసి భక్తిశ్రద్ధలతో పూజలను చేస్తున్నారు.ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, మురారీ తదితరులు ముడుపుల పూజలను దగ్గరుండి చేయిస్తున్నారు.స్వామి వారిని రకరకాల పూలతో చేసిన అలంకరణ భక్తులను ఆకట్టుకోవడంతో పాటు ప్రతీ ఒక్కరు వారి వారి సెల్ ఫోన్లులో స్వామి వారి ఫోటోలు తీసుకోవడం కనిపించింది.ప్రతీగురువారం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి నరసింహస్వామీ ముడుపులపూజలకు దూరప్రాంతాలనుండి కూడా పెద్ద ఎత్తున వాహనాలతో భక్తజనంవిచ్చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలను చేసి స్వామివారిని దర్శించుకుని, గోవింద గోవింద, జైశ్రీలక్ష్మినరసింహ, ఓం నమో నారాయణాయ అంటూ 27సార్లు ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.పూజలయ్యాక తీర్దంతీసుకోవడానికి, ప్రసాదాలు తీసుకోవడానికి గంటలతరబడి క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ఉదయంనుండి సాయంత్రం వరకు బ్యాచులవారీగా భక్తులు ముడుపులు పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాత, కొత్త భక్తులు కలిపి ప్రతీ గురువారం దాదాపు రెండు వేల మంది భక్తులు విచ్చేసి పూజలు నిర్వహించడం గమనార్హం.