విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని సీతానగరంలోగల శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయంలో గురువారం జరిగిన ముడుపుల పూజలకు పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చి భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు.వర్షం పడుతున్న లెక్కచేయక శ్రీలక్ష్మీనరసింహస్వామి
ఆలయంలో తెల్లవారుజామున మూడున్నరగంటల నుండి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారికి ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు పూజలను ప్రారంభం చేసి సాయంత్రం వరకు నిర్వహించారు. ప్రతీగురువారం శ్రీలక్ష్మి నరసింహస్వామీ దేవాలయంలోజరుగుతున్న ముడుపుల పూజలకు అనూహ్య స్పందనతో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలనుండి భక్తులు విచ్చేసి భక్తిశ్రద్ధలతో, ఉపవాసాలతో పూజలు చేస్తున్నారు. స్వామి వారి ఆశీస్సులు ఉండాలని భక్తి శ్రద్ధలతో పాటు ఉపవాసంతో ఉండి పూజలు చేయడంతో పాటు పెద్ద ఎత్తున వివిధ మండలాల నుండి భక్తులు రావడం గమనార్హం.