విశాలాంధ్ర – విజయనగరం టౌన్ : జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మే 13న విజయనగరం పట్టణం తోటపాలెం ఎం.ఎస్.ఎన్. కళాశాలలోని పోలింగు కేంద్రంలో సామాన్య ఓటర్లతోపాటు క్యూ లైనులో నిలబడి, తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.