కేసలి అప్పారావు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ వారం రోజుల్లో ముగ్గురు శిశువులను వీధి కాలువల్లో, చెత్త కుండీలలో వేసి వారి బంగారు భవిష్యత్తు ను నాశనం చేయడం చాలా దురదృష్ట కరమని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ యువత కొన్ని ప్రత్యేక పరిస్థితులు వలన , దురలవాట్లు, చెడు స్నేహాలు వలన గర్భం దాల్చి , ప్రసవించి జన్మనిచ్చిన శిశువును తమ నుండి దూరం చేసుకోవడానికో, వదిలించుకోవడానికి దారుణంగా నిర్మానుష్యంగ ఉన్న ప్రదేశాలు, వీధి కాలువల్లో, పొదల్లో,చెత్త కుండీలలో వేయడం జరుగుతుందని తెలిపారు.
ఎవ్వరికైనా పిల్లల పెంపకం,పోషణ,రక్షణ,సంరక్షణ కోసము ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు ఐతే ఏటువంటి శిశువులను ,బాలలను ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు వారి అధీనంలోకి తీసుకొని వారికి పూర్తి స్థాయిలో రక్షణ, సంరక్షణ కల్పించి మంచి బంగారు భవిష్యత్తు కల్పిస్తుందని తెలిపారు.
అంతేకాకుండా ఇటువంటి శిశువులు కోసము జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల ను ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఆ ఊయలలో ఇటువంటి శిశువులను వేసినట్టి అయితే ఆ లు శిశువులను ప్రభుత్వాధికారులు బాలల సంరక్షణ కేంద్రాలు లో ఉంచి దత్తత ఇవ్వడం జరుతుందని, వదిలి వేయబడిన వారి యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
జరుగుతున్న ఇటువంటి దురదృష్టకర సంఘటనలు నేపథ్యంలో స్థానికంగా ఉండే అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయం సిబ్బందికి గర్భిణీ స్త్రీలు గర్భం ధరించిన దగ్గర నుండి ప్రసవించి తమ స్వస్థలానికి చేయూకున్న అంతవరకు నిశితంగా పరిశీలించి నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.రాష్ట్రంలో వేల మంది కుటుంబాల్లో పిల్లలు లేక దత్తత కోసము దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారనీ, ఏటువంటి కుటుంబాలకి ఇటువంటి ఈ పిల్లలను వారికి దత్తత ఇచ్చి వారికి సహాయం చేసిన వారం అవుతామని తెలిపారు.
ఈ జరిగిన సంఘటనలు పై పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారని తెలిపారు.
మళ్ళీ పునరావృతం కాకుండా విస్తృతంగా గ్రామ స్థాయి నుండి అందరికీ అవగాహన కార్యక్రమాలను
చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.