Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎన్నికల కౌంటింగు కేంద్రాల వద్ద విస్తృత భద్రత ఏర్పాట్లు

సమీక్షా సమావేశంలో – జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఎన్నికలు ముగిసిన తదుపరి జూన్ 4న ఎన్నికల కౌంటింగు కేంద్రాల వద్ద చేపట్టాల్సి భద్రత, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకుగాను జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన తరువాత జూన్ 4న ఎన్నికల కౌంటింగు నిర్వహించే జె.ఎన్.టి.యు, లెండీ ఇంజనీరింగు కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఎన్నికల కౌటింగు కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన భద్రత చర్యల పట్ల అధికారులకు జిల్లా అవగాహన కల్పించి, దిశానిర్ధేశం చేసారు. కౌటింగు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలన్నారు. కౌంటింగు కేంద్రాలకు విచ్చేసే వివిధ పార్టీలకు చెందిన కౌంటింగు ఏజంట్లు వాహనాలను కౌటింగు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా నిర్ధేశించిన పార్కింగు ప్రాంతాలకు తరలించాలన్నారు. వాహనదారులు ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని, కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌటింగు కేంద్రాలలోకి వెళ్ళే కౌటింగు ఏజంట్లును కుణ్ణంగా తనిఖీ చేయాలని, రిటర్నింగు అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాత్రమే కౌటింగు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. రిటర్నింగు అధికారులు, కౌటింగు సూపర్ వైజర్స్ మినహా మిగిలిన వారి మొబైల్స్ ను కౌటింగు కేంద్రాల్లోకి అనుమతించ వద్దన్నారు. కౌటింగు కేంద్రాల పరిసరాలను బాంబ్ డిస్పోజల్స్ బృందాలతో తనిఖీలు చేయాలని, మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఫలితాలు వెల్లడైన తరువాత ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తుచర్యలు చేపట్టాలని, పెట్రోలింగు నిర్వహించాలని, ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ట్రైనీ ఐపిఎస్ మండ జావలి అల్ఫాన్స్, విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపరుపల్లి డిఎస్పీ ఎ.ఎస్. చక్రవర్తి, ట్రాఫిక్ డిఎస్పీడి.విశ్వనాధ్, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ట్రైనీ డిఎస్పీ ఎస్.మహేంద్ర, సిఐలు కే.కే.వి. విజయనాధ్, జె. మురళి, బి.వెంకటరావు, కే.రామారావు, ఎం.శ్రీనివాసరావు, బి. వెంకటేశ్వరరావు, రవికుమార్, ఎం. నాగేశ్వరరావు, ఎస్.తిరుమలరావు, వి.వి.చంద్రశేఖర్, సత్యన్నారాయణ, బి. లలిత, బి.నాగేశ్వరరావు, మోహనరావు, ఎస్.శ్రీనివాస్,మురళి, హెచ్.ఉపేంద్రరావు, చంద్రశేఖర్, రాజశేఖరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img