జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి సాయి కుమార్
విశాలాంధ్ర,పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా పార్వతీపురంలోని శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాల ఆవరణలో మంగళ వారం నిర్వహించిన మినీ జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు. సాయి కుమార్ తెలిపారు.ఈమినీ జాబ్ మేళాలో సైట్ స్పెక్ట్రమ్ టెక్నాలజీస్, ఎం ఎస్ ఎన్ ల
ల్యాబ్, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈజాబు డ్రైవుకు 111మంది ఇంటర్వ్యూలకుహాజరుకాగా, వారిలో 37 మంది ఈమూడుకంపెనీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న శ్రీవేంకటేశ్వర గవ్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతి రావు మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా జాబ్ మేళా నిర్వహించడం ఇది ఎనిమిదోసారన్నారు.ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సహకారంతో మరిన్ని నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యూ.సాయికుమార్ మాట్లాడుతూ ఇలాంటిఅవకాశాలని నిరుద్యోగయువత అందిపుచ్చుకుని ఉన్నతశిఖరాలు అదిరోహించాలని కోరారు.ఎంపికైనవారికి ఎంపిక ఉత్తర్వులు ఆయా కంపెనీల ప్రతినిధులు అందజేసారు.ఈకార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.