ప్రచారమేనా?ప్రయోగమవునా?
విశాలాంధ్ర విజయనగరం : చీపురుపల్లి నియోజక వర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల మైండ్ గేమ్ తో ఇరు పార్టీల నుంచి బరిలో దిగేదెవరనే చర్చ సాగుతోంది. చీపురుపల్లి వైసీపీ నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సారి విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.అదే జరిగితే బొత్స స్థానంలో చీపురుపల్లి నుంచి పోటీ చేసేదెవరనేది మరో ఆసక్తికర అంశంగా మారిఃది.ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తోంది.2019లో పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలైనా కిమిడి నాగార్జున చీపురుపల్లి నియోజక వర్గాన్ని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ,క్యాడర్ అంటిపెట్టుకుని వున్నారు.ఈ సారి పార్టీ వేవ్ కూడా వుందని నాగార్జున ఖచ్చితంగా గెలుస్తారనే నమ్మకంతో ఆ పార్టీ వర్గాలు నమ్మకంగా చెపుతున్నారు.ఈ నేపథ్యంలో గంటాను చీపురుపల్లి నుంచి బరిలోకి దిఃపుతారనే మాట చెవినపడితే చాలు స్థానిక టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.అయితే బొత్స భీమిలి నుంచి పోటీ కి దిగుతారని ప్రచారాన్ని దృష్టి లో పెట్టుకుని టీడీపీ కూడా గంటా పోటీకి దిగుతారనే ప్రచారు చేస్తోందని విశ్లేషించే వారూ లేకపోలేదు.ఏది ఏమైనా
అధికార ప్రతిపక్ష పార్టీల అధిష్టానాల మైండ్ గేమ్ తో క్షేత్ర స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంటోందనేది వాస్తవం.