విశాలాంధ్ర,సీతానగరం:సీతానగరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గుచ్చిమి గ్రామంలో రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగలవారం నిర్వహించారు.స్పెషలిస్టు వైద్యులు డాక్టర్ చింత స్వరూప్ , డాక్టర్ రాజేంద్రతో పాటు స్తానిక పి హెచ్ సి వైద్యులు నీహారిక,బి.పావని, కె.రమేష్ , అప్తోల్మిక్ ఆద్వర్యంలో రోగులకు తనిఖీలు నిర్వహించారు.ఈశిబిరం ద్వారా సాధారణ చికిత్సల కొరకు 98మంది , కంటిసమస్యలతో 35 మంది , ఇతర వ్యాధులతో బాధపడుతున్న100 మందికి చికిత్సలు అందజేసి మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు పావని తెలిపారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ మర్రాపు శ్రీదేవి, ఎంపిటిసి చెల్లారపు జగదీష్, ఉప సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడు, శంకరరావు, అప్పల నాయుడు,నాయకులు,సచివాలయం సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆశాకార్యకర్తలు, రోగులు పాల్గొన్నారు.