విశాలాంధ్ర -విజయనగరం టౌన్ : విజయనగరం శాసన సభ్యురాలుగా ఎన్నికైన పూసపాటి అదితి గజపతిరాజును నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ఈరోజు బంగ్లాలో మర్యాద పూర్వకంగా కలుసుకొని, పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు వివిధ విభాగాల అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అదితి గజపతిరాజును కలిసిన వారిలో సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఈఈ కే.శ్రీనివాస రావు,ఏసిపి.అమ్మాజీ రావు, మేనేజర్ ప్రసాదరావు,ఆడిట్ అధికారి లూధర్ పాల్, టిపిఆర్ఓ సింహాచలం, గణాంక అధికారి రోజావెంకటలక్ష్మీ, డిఈలు,ఏఈలు,ప్రజారోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.