విశాలాంధ్ర,సీతానగరం: మండలకేంద్రంలో శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారంనాడు ఓంనమో శ్రీలక్ష్మి నరసింహస్వామి, ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీ వేణుగోపాలస్వామి అంటూ ముడుపుల పూజలకు వేకువ జాము నుండే భక్తులువివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున విచ్చేసి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. ఆలయఅర్చకులు పీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, కృష్ణామాచార్యులు, మురారీ తదితరులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.గురువారంనాడు రకరకాల పూలతో అలంకరణతోపాటు గంథంతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.ప్రతీగురువారం నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి నరసింహస్వామీ ముడుపులపూజలకు దూరప్రాంతాలనుండి వాహనాలతో భక్తజనం పెద్దఎత్తున విచ్చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో పూజలను చేసి స్వామివారిని దర్శించుకుని, గోవింద గోవింద, జైశ్రీలక్ష్మినరసింహ, ఓం నమో నారాయణాయ అంటూ 27సార్లు ప్రదక్షిణలుచేయడం గమనార్హం. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలను అందుకుంటున్నారు.