విశాలాంధ్ర,సీతానగరం: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డికి సంబందించి పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రంలో ఆర్టీసి బస్సు స్టాండుకు దగ్గరలో నూతనంగా ఏర్పాటుచేసిన భారీవిగ్రహంను నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజన్న దొర,జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేతులు మీదుగా ఘనంగా ప్రారంభించడం జరుగుతోందని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. సీతానగరం మండలపరిధిలో గ ప్రతీగ్రామం నుంచి భారీస్థాయిలో వైకాపా శ్రేణులు తరలి వచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు,జెడ్పీటీసీ బాబ్జి, వైస్ ఎంపిపి సూర్యనారాయణ,వైసీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, గృహసారథులు, తదితరులు పాల్గొన్నారు. మూడు మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.