విశాలాంధ్ర-విజయనగరం రూరల్ : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో ధాత్రి సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ స్టెమ్సెల్ దానము & హెచ్ఎల్ఏ టైపింగ్ డ్రైవ్పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా ధాత్రి సంస్థకు చెందిన ఎమ్.సూర్య నారాయణ విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాత రోగికి వ్యాక్సిన్ లాంటివాడని, లాలాజల దానం మాత్రమే తీసుకోవాలని,ఏ రోగికైనా డి.ఎన్.ఎ పరీక్ష సమయంలో అది ఉపయోగపడుతుందని తెలియజేశారు.విద్యార్థుల నుండి సుమారుగా 400 నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ఆయన సీతం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి.శిభూషణ్రావు, ప్రిన్సిపాల్ డా.డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్.వెంకటలక్ష్మి, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఎన్.సతీష్ కుమార్ మరియు విద్యార్థులుపాల్గొన్నారు.